తెలంగాణ డిగ్రీ అడ్మిషన్ల DOST 2024 నోటిఫికేషన్ విడుదల.. ఈనెల 6 నుంచి మొదటి విడత రిజిస్ట్రేషన్లు
Telangana DOST Degree Admission Notification 2024 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (TS DOST 2024) నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, మహిళా యూనివర్సిటీ, జేఎన్టీయూ, పాలిటెక్నిక్లో డీ-ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం మూడు విడుతల్లో అడ్మిషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈసారి మొత్తం మూడు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. TS DOST 2024 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 6 నుంచి ప్రారంభమవుతుంది.
Telangana DOST Notification 2024 ముఖ్యమైన వివరాలు:
- మొదటి విడత రిజిస్ట్రేషన్లు మే 6 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 25 వరకు విద్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు.
- జూన్ 3న సీట్లను కేటాయిస్తారు. జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు విద్యర్థులు సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
- రెండో విడత రిజిస్ట్రేషన్ జూన్ 4 నుంచి ప్రారంభమవుతుంది. 13వ తేదీవరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- జూన్ 4 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఇక జూన్ 18న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో జూన్ 19 నుంచి 24వ తేదీలోపు సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
- ఇక చివరిదైన మూడో విడత రిజిస్ట్రేషన్ జూన్ 19 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 25 వరకు అభ్యర్థులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు.
- అదే నెల 19 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వవచ్చు.
- జూన్ 29న సీట్లను కేటాయిస్తారు. అదే రోజు నుంచి జూలై 3 వరకు విద్యార్థులు సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే.. మూడో విడత రిజిస్ట్రేషన్లకు విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. జూలై 7 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి.




Comments
Post a Comment