మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణలో రెండు కొత్త పథకాలు

 తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రెండు కొత్త పథకాలు ప్రారంభించింది. మైనారిటీల సంక్షేమం కోసం ఈ రెండు కొత్త పథకాలు ఉద్దేశించారు. 'ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన' పేరుతో.. ఒంటరి మహిళలు, వితంతువులకు రూ.50వేలు ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందిస్తారు.



ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన: ఈ పథకం కింద వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ. 50,000 సహాయం అందిస్తారు. వారు చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి, స్వయం ఉపాధి కల్పించుకోడానికి ఇది ఉపయోగపడుతుంది.

రేవంత్ అన్న కా సహారా': ఈ పథకం కింద, ఫకీర్, దూదేకుల వర్గాలకు రూ. 1 లక్ష సహాయం అందిస్తారు. వాళ్లు మోపెడ్స్ (ద్విచక్ర వాహనాలు) కొనుగోలుకు సాయం అందిస్తారు. ఫలితంగా వారు తమ జీవనోపాధిని మెరుగుపర్చుకోవడానికి ఈ పథకం సహాయపడుతుంది.



ఈ పథకాలకు రూ.30కోట్లు నిధులు కేటాయించారు. రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 19, 2025 నుంచి అక్టోబర్ 6, 2025 వరకు జరుగుతుంది.

Comments

Popular posts from this blog

డిగ్రీ అర్హతతో 14,582 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం.!

RRB Group D Admit Card 2025 Link